Showing posts with label Draft for Radio Script. Show all posts
Showing posts with label Draft for Radio Script. Show all posts

Friday, January 7, 2011

Revised script Submitted for the AIR New Year Programme

This is the second draft - with quick corrections - not to miss the deadline - Dr. Vijaya would have fine tuned it during the recording exercise.

ఈ రూపకం నా 2010 కి కొసమెరుపు 2011 కి తోలి పలుకు...
అమ్మ కడుపు చల్లగా...


సాలమ్మ: నరసమ్మత్తా...ఓ నరసమ్మత్తా.. ...నరసమ్మత్త..ఇంకా ఊర్నించి రానట్టుగా ఉందే.
నరసమ్మ: ఎవరూ సాలమ్మా…రా...
సాలమ్మ: ఇంకా ఊర్నించి వచ్చినావో ..లేదో అనుకుంటుండా ...ఇదిగో నరసమ్మత్తా...నువ్వు ఊరిలో లేకపోతివి గానీ ...ఆ ఎంకటేశు లేడూ ..కూతురి పెళ్లి ఎంత బాగా చేసినాడనుకున్నావ్..
నరసమ్మ: అవునా... మంచిది..
సాలమ్మ: ఈ సంవత్సరం ఆ ఎంకటేశుకి పత్తిలో బాగా కలిసొచ్చినాదంట...దెబ్బకి ..దశ తిరిగిపోయిందనుకో..
నరసింహం: తిరిగిపోద్ది..తిరిగిపోద్ది...ఆడికేం...ఆడు యాపారస్తుడూ...పెట్టుబడి పెట్టాగలడు...అదును, పదునూ చూసి సరుకు అమ్మాగలడు..
సాలమ్మ: నరసింహం మామా..నువ్వాపకుండా ..ఉంటే మేమూ..పత్తే ఏసేటోల్లం. ఎంకటేశు కూతురి పెళ్ళికి బంగారు నాంతాడు...ఏస్కోని పోయేదాన్ని...ఆ..
నరసింహం: బంగారు నాంతాడు...ఏస్కోని పొయ్యేదానివో...లేదో ...ఎవురికి ఎరుక?
నరసమ్మ:.. ఏందయ్యా...ఆ మాటలు....మనం ఏం సెప్పినా ..దాని మంచి కోసమే కందా...
నరసింహం: అది అట్టనుకుంటే కదా...మనవల్ల నష్టపోయినామంటే ..నాకు సిర్రెత్తుకొచ్చినాది.

సాలమ్మ: మాకున్నది ఈ పోలమే గందా మావా..ఎదుగూ..బొదుగూ..లేక...ఆ..జొన్నలూ, శెనగలే ఏసుకోవాలంటావా ..
నరసింహం: మీకు ఆధారం ఈ పొలమొక్కటే కందా.. అందుకే ఇంకా జాగ్రత్తగా ఉండాల.. ఎటు పోయి ఎటొచ్చినా.. .మనకు లాభం రాకున్నా సరే నష్టం మాత్రం రాకుండా చూసుకోవాల..అప్పు చేసి ఎవసాయం చేస్తే ...పంట మునిగితే ..ఆ వడ్డీలు పెరిగి మనమూ మునిగినట్టే. అందుకే అంత పెట్టుబడి అవసరం లేని పంటలే ఏసుకోవాల.
నరసమ్మ: అయినా….జొన్నలూ, శనగలూ ఏసుకుంటే తప్పేటంట...ఒక్క జొన్నలూ, శెనగ లేందీ..రాగులూ ..కందులూ గూడ..ఏసుకో..నాలుగు..కోళ్ళూ ..నాలుగు మేకలూ కూడ పెంచుకో...ఇయ్యన్నీ ఇంటికీ..వంటికీ మంచియి.
సాలమ్మ: ఇంటికీ ..వంటికీ మంచిదైతే సరిపోద్దేటి. ఇయ్యాల రేపు నాలుగు రాళ్ళు సంపాదించకపోతే ఎట్టాగా ...
నరసమ్మ: సాలమ్మా లక్షల గురించి ఆలోచించకుండా ..లక్షణంగా ఉన్నంతలో పిల్లల్ని సక్కంగా సాక్కో ..
సాలమ్మ: అవును నరసమ్మత్తా ...నా ఆశలన్నీ పిల్లలమీన్నే ..ఎట్టాగైనా.. ఈళ్ళని పెద్ద పెద్ద సదువులు సదివించి మంచి కొలువుల్లో సూడాల


నరసమ్మ: ఇదిగో సాలమ్మా..ఎంతసేపూ సదువూ..సదువూ అని ఆళ్ళని సతాయించమాక. అస్తమానూ సదవమంటే ఆల్లకి సదువంటేనే ఇసుగు పుడతాది..ఏదైనా..పనీ పాటా కూడా నేర్పించు..కుట్లో ..అల్లికలో.. వడియాలో, ఒరుగులో ఏదో ఒకటి..నేర్చుకుంటే నీకు సహాయంగా ఉంటారు కదా. మీరందురూ కలిసి ఏ పని చేసుకున్నా అంతో ఇంతో వస్తాది.. ఏన్నీల్లకు చన్నీళ్ళుగా ఆళ్ళ ఫీజులకీ, పుస్తకాలకీ అయినా కలిసోస్తాది.
నరసింహం: ఈ రోజుల్లో సదువంటే మాటలా...ఆళ్ళ సిన్నప్పుడే తాహతుకి మించి సదువుల మీన పైసలు పెట్టి అప్పుల పాలు గావద్దు..అయినా..ఆ ఉద్యోగాలూ అట్టనే ఉండాయి. అంతలో వస్తున్నాయి..అంతలో పోతున్నాయి..మనం పిల్లలకి ముందు ధైర్యం నేర్పించాల, కష్టపడే అలవాటు చేయాల..
సాలమ్మ: అంతేలే మనం చేసేది చెయ్యాల…ఆపైన...ఆ సామి దయ..
నరసింహం: అద్గదీ.. పంటలైనా అంతే ..మనం చెయ్యవలసినదంతా ..సెయ్యాల..ఆ పైన..ఓ సంవత్సరం మంచిగుంటాది.. ఓ సంవత్సరం ముంచుతాది. మనం ధైర్యంగా నిలబడాల...అంతేగానీ ..బెంబేలు పడి ...ఉసురు తీసుకుంటే ఆ భార్యా బిడ్డలకి దిక్కెవరు..
నరసమ్మ: పంట పొతే పాయె ..మడుసులన్నా దక్కాల కదా..బతికుంటే ...బలుసాకుతినచ్చు అంటారు..కాలమెప్పుడూ ఒక లాగ ఉండదు కందా..
సాలమ్మ: అంతేలే ఓర్పుతో ఉంటే మంచి రోజులు రాక పోతాయా


నరసింహం: ఓర్పు ఒకటీ సరిపోదు సాలమ్మా...నేర్పు కూడా కావాల. మన పంట విషయమే తీసుకో..ముందు మన వాతావరణానికి ఏ పంటలు సరిపోతాయో తెలుసుకోవాల. ఏదో …ఒకటో ..రెండో పంటలు యేసి దేవుడా ..నీదే భారం అని సేతులు ముడుసుకుని కూచోరాదు...వీలైనన్ని రకాల పంటలు వెయ్యాల. ఒకటి ముంచినా వేరొకటి వస్తాది.
సాలమ్మ: ఒక రకం విత్తనాలు కొనడానికే పైసల్లేకపాయే..ఇంక ..ఇన్ని రాకాలేడ్నుంచి తేవాలా..
నరసింహం:..యాడ్నుంచో కాదు సాలమ్మా ..నీ పొలంనుంచే..కాకపొతే ఇంకోరి పొలం లోంచి..నువ్వు దాచిన విత్తనాలు వాల్లకిస్తే ..వాల్ల విత్తనాలు నీకిస్తారు... ఎనకటికి మన పెద్దోళ్ళు అట్టాగే సేసే వాళ్ళు కందా..
సాలమ్మ: మరి మన పొలాల్లో విత్తనాలు పనికొస్తయంటావా?
నరసమ్మ: మన తాత ముత్తాతలంతా అయ్యే ఏసేవారుగా...
సాలమ్మ: ఆ రోజులు వేరు...ఈ రోజులు వేరు...నరసమ్మత్తా.. ఇప్పుడేమో ఐబ్రీడ్లు వచ్చినాయ్ కందా
నరసమ్మ:..అదీ నిజమే అనుకో ..కాకపొతే నువ్వు దాచుకున్న విత్తనాలైతే నీ సేతిలోనే ఉంటాయి..అదను తప్పకుండా పంట ఎసుకోవచ్చు....పైగా..విత్తనాలు కొనే ఖర్చు కూడా ఉండదు.

నరసింహం:..అంతే కాదు..మోసపోయి ..పంట మొత్తం పోగొట్టుకునే పెమాదం ఉండదు. అట్టాగే ఎరువులు కూడా అవసరమైన మేరకే ఏసుకోవాల ...పచ్చి రొట్ట పైర్లతో, ఆకెరువుతో, వానపాము ఎరువుతో భూసారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాల కానీ, అప్పు చేసి ఎరువులు కొనరాదు..
సాలమ్మ: ఎరువులగన్నా కూడా...ఈ పురుగు మందులు కొట్టడానికే చానా పైసలు పోతున్నాయి మామా
నరసింహం:..అంతే కదా మరి..ఎవరో చెప్పారనో..లేదా పంట పోతుందేమోనన్న భయంతోనో ...అవసరమున్నా లేకున్నా..పిచికారీలు చేస్తే ఖర్చు పెరుగుద్ది ...విత్తనం వేసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ది చేసుకుంటే ..చాలా వరకూ మనం పంటను కాపాడు కోవచ్చు.. తరువాత కూడా.. పైరును జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే - గుడ్డు దశలోనూ, పిల్ల పురుగుల దశలోనూ చేతితో ఏరి పారేసి కొంత వరకూ పంటను కాపాడుకోవచ్చు...పిచికారీ అవసరమైనప్పుడు కూడా.. రసాయనిక పురుగు మందులు కాకుండా... యాప మందులు… మొక్కల కాషాయాలూ వాడాల
సాలమ్మ: అట్టాగే నరిసిమ్మావా..ఈ పాలి మా పొలాన్నీ, పంటలను కూడా ..మా పిల్లల్లాగే ..సక్కగ..సాక్కుంటాలే...కానీ నరిసిమ్మావా..ఎంకటేశుని చూసి మా ఇంటాయన కూడా పత్తి, మిరప పెట్టాలని చూస్తున్నాడు...మనకీ ఆడపిల్లలున్నారు..మనమూ ఆళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా చెయ్యాలని ఒకటే ఇదైపోతున్నాడు..
నరసింహం: కూతుళ్ళకి ఘనంగా పెళ్లి చెయ్యాలన్నఆశ తండ్రికి ఆమాత్రం ఉండదేటి?.. కానీ ఆ ఆశే ..నిరాశగా మారితే .. కట్టం కదా..
సాలమ్మ: మరి నేను పత్తి జోలికి పోవద్దయ్యా అంటే ఇంటాడో లేదో...
నరసమ్మ: ఈ మొగాళ్ళ మాట ఇంటూ కూర్చుంటే అయినట్టే. ముందంతా ..నీకేం తెల్దు...నీకేం తెల్దంటూ...ఎవసాయం అని, యాపారం అని ఉన్నదంతా తగలేసి ...ఆ తర్వాత యాదో ఒకటి సేసుకోవడం.. ఆడికేదైనా అయితే అయితే ఆ ఉన్న అండ కూడా పోయి ఎటూ కాని పిల్లలతో అప్పుడు ఈ ఆడోల్లే అవస్థ పడాల..
సాలమ్మ: హమ్మో ఇనదానికే భయమేస్తావుందత్తా ...
నరసింహం:..ఇదిగో మీరిట్టా .. బయపడతారనే..ఆళ్ళు మీకు ఏ సంగతీ చెప్పరు..

నరసమ్మ: ఆ..ఆ… ఏమీ సెప్పా పెట్టకుండా… సేస్తే మాత్రం బాగుంటాదా అని ..
నరసింహం: అదేందే ..ఉరుమురిమి మంగలం మీద పడినట్టు..అది ఆడి గురించి సెప్తే.. నువ్వు అందరినీ అంటుడావు. నీతో సెప్పకుండా నేనేదైనా సేశానేటి. ఇంట్లో అందరితో మాటాడి, ముక్కెంగా ఆడోల్లతో అది ఇట్టా, ఇది ఇట్టా అని అనుకోని సేసినప్పుడే మంచిగుంటాది.
సాలమ్మ: మంచి మాట సెప్పినావ్ మామా … ఇక నే పొయ్యొస్తా ..నరసమ్మత్తా. వస్తా…
నరసమ్మ: ఉండు సాలమ్మా..మా ఊరు నుంచి కూరగాయల విత్తనాలు తెచ్చినా.
సాలమ్మ: అట్టాగా..ఊర్లో అంతా బాగుండారా


నరసమ్మ: ఏం బాగులే సాలమ్మా .. ఆమద్దెనొచ్చిన వచ్చిన వరదలకి మావోల్లంతా బాగా దెబ్బతిన్నారు...ఎవసాయం ఎర్రోని చేతిలో రాయిలాగైపోయినాది….ఎటుపోతుందో తెలియదు .. ఏమైతాదో తెలియదు …అతివృష్టి ..అనావృష్టి.....అనావృష్టికైనా ..ఉపాయాలున్నాయేమో కానీ ..ఈ అతివృష్టి తో అంతా ..తుడిచిపెట్టుకుపోయినాది … ...ఆల్లకేదో ధైర్యం సెప్పాను కానీ ...ఆళ్ళ పరిస్థితి తల్సుకుంటే నాకే గుబులుగా ఉంది...
సాలమ్మ: ఊరుకో నరసమ్మత్తా ...అంతా సర్దుకుంటాదిలే.. ఇది.. .మీ వోల్లొక్కరికే వచ్చిన పరిస్థితి కాదు....శానామంది పరిస్థితి ఇట్టానే ఉంది… యాదో విధంగా ప్రభుత్వం ఆదుకుంటాదిలే
నరసమ్మ: మారాజుల్లాగా ఉండే టోళ్ళు ...మా రైతులే రాజులం ...మాకు కొలువు లెందుకనేవోళ్ళం... దేనికీ ఎవురినీ దేబిరించే పనే లేకపాయే..ఇత్తనాలు మనవే..పాడి మస్తుగుండె ..ఎరువుకి ఇబ్బందనేదే లేకపాయే..ఒక పాడేనా..కోళ్ళు, మేకలు, .ఒకతనేమి లేదు..అన్నీ మనవేనాయె… ఇప్పుడు రోజులే మారిపోయినాయ్..
నరసింహం: రోజులంటా వేటి.…కాలాలే మారిపోతే..అప్పుట్లో ఏ కాలానికి ఆ కాలం ఉండేది.ఏ కాలంలో పెట్టే పంటలు అప్పటియి. ఇప్పుడో .. అన్ని కాలాలూ.. కల్సిపోయినాయ్
నరసమ్మ: వానలెప్పుడుస్తాయో తెలవదు.. పంట ఎప్పుడు పెట్టాలో తెలవదు.. ఎట్టాగో పంట పండిచ్చినా, పంట కోతకోచ్చేతాలికి వానలు కుమ్మరిస్తుండాయ్… ఏందో కలికాలం. ఈ కష్టాలన్నీ మనకే వస్తుండాయ్


నరసింహం: ఇది ఇప్పుడు మన ఒక్కరికే వచ్చిన కట్టం కాదే. దేశం మొత్తం మీద పరిస్థితి ఇట్టాగే ఉంది…ఒక్క మనదేశంలోనే కాదు..అన్ని దేశాలలో ప్రజలూ ఇట్టాంటి వరదల వలన, కరువుల వలన అనేక రకాల క ట్టాల పాలౌతున్నారు...మనుషులే కాదు…ఈ వాతావరణంలో వచ్చే పెద్ద పెద్ద మార్పులకు కొన్ని జాతుల మొక్కలూ, జంతువులూ కూడా కానరాకుండా పోతున్నాయ్
సాలమ్మ: అట్టాగా...ఈ ఇపరీతమైన ఎండలకీ ..వానలకీ మడుసులే బతకట్లేదు…ఇంక మొక్కలేం బతుకుతాయ్ ..
నరసింహం: అందుకే మనం ఇట్టాంటి ఇపత్తులను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాల...జీవిత భీమాలు, పంట భీమాలు సేయించుకోవాల, దిగుబడి బాగా వచ్చినప్పుడు మంచి ధర చూసి అమ్ముకోవాల ...సరుకు పాడవకుండా ...మంచి గిడ్డంగులను అందురూ కలిసి ఏర్పాటు చేసుకోవాల…
నరసమ్మ: ముఖ్యంగా లాభాలొచ్చినప్పుడు ఆ డబ్బును అవసరానికి అందివచ్చేలాగా జాగ్రత్త చేసుకోవాల… మళ్ళీ పంట ఏసుకోవటానికి పైసలుంటాయ్ ...ఎట్టైనా నేలను నమ్ముకున్నోల్లమైతిమి… మల్ల మల్ల పంటలు పెడ్తుండాల ..మంచి దిగుబడి తెచ్చుకోవాల..
నరసింహం:... అద్గదీ యాది పోయినా ..మనం ధైర్యాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకూడదు… అయినా కష్టాలు లేనిదెవరికీ.. ఎన్ని కష్టాలుండా నిబ్బరంగా ఎదుర్కోని పోరాడాల ..అప్పుడే మనకు మంచి జరుగుతాది.
చంద్రయ్య: తధాస్తూ…బాబాయ్ ఇలాగే ఎప్పుడూ మంచే జరగాలనీ, జరుగుతుందనీ మనం అనుకుంటూ ఉండాల. ఎందుకంటే మన ఆలోచనల బట్టే మన మాటలు, మన మాటల్ని బట్టే చేతలూ ...
సాలమ్మ: చేతలని బట్టే రాతలూ …
చంద్రయ్య: అదీ.. బాగా సెప్పావ్ సాలమ్మా
నరసమ్మ: ఈ చంద్రయ్య వచ్చినాడంటే యాడాడి ముచ్చట్లూ సెప్తాడు ...చంద్రయ్యా నీ ముచ్చట్లిని చాల దినాలాయె ...ఏందీ ఈ మద్దిన అగుపడట్లేదూ..పట్నం పోయా?
చంద్రయ్య: ఏం పిన్నీ ...ఎప్పుడూ పట్నాలేనా ..మన పల్లెల్లో కూడా ..తెలుసుకోవలసిన విశేషాలు శానా ఉండాయ్
నరసింహం: యాడికి పోయినావేంటి..
చంద్రయ్య: వరంగల్లు జిల్లాలో జనగాం కాడ.. పల్లెటూళ్ళన్నీ చూసొచ్చినా .ఆడ చాలా మంది రైతులు శ్రీ వరి పద్ధతిలో వరి ఎంత బాగా సాగు చేస్తుండారనుకుండావ్..సుగుణమ్మని .. శ్రీ వరి సాగు మంచిగ చేస్తోందని చెప్పుకుంటుంటే...నేనూ పోయి ఆ ముచ్చట్లన్నీ రాసుకోనొచ్చా..
నరసింహం: అట్టనా
చంద్రయ్య: ఆమె మామూలుగాన్నా కూడా తక్కువ నీరు వాడినాదంట. అయినా .. .దిగుబడి తగ్గలేదు సరి కదా… దిగిబడి మామూలు కన్నా ఎక్కువే వచ్చినాదంట.. అందురూ మెచ్చుకుంటుండారు
నరసమ్మ: మరి ఆడ కూతురు అంత మంచిగ చేస్తే మెచ్చుకోరూ…
చంద్రయ్య: ఆమె అమెరికా కూడా పోయోచ్చినాదంట
సాలమ్మ: అట్టాగా..అదురుష్టమే!
చంద్రయ్య: నిజమే సాలమ్మా ..మనకిట్ట అయ్యిందే ..ఎట్టాగా..అని దిగులు పడకుండా...కష్టపడతా ఉంటే ...ఏదో ఒక రోజు...ఏదో రూపంలో.. అదృష్టం కలిసోస్తాది.. . ఆ నోటా ..ఈ..నోటా మన గురించి ఇన్నోళ్ళు..మన సరుకు కొనడానికి రావచ్చు..లేదా..ఇంకేదైనా మంచి జరగచ్చు..
చంద్రయ్య: ఇట్టాంటి మంచి విషయాలు, కొత్త విషయాలూ తెలుసుకుంటూ ఉండాలి సాలమ్మా...అట్టాంటియన్నీ ..ఇంటా ఉంటే ...ఆళ్ళు చేశారు మనమూ చెయ్యగలమూ..అని నమ్మకం వస్తాది..
సాలమ్మ: అంతేలే
చంద్రయ్య: మనకు సమస్య ఏదైనా వస్తే ...ఇట్టాంటి సమస్య వచ్చినప్పుడు ..వాల్లిట్టా చేశారు.. మరి..నేను ఎం చెయ్యాల అని యోచన చేసుకోవాల. ఒక్కోసారి పెద్ద సమస్యకు కూడా.. చిన్న చిన్న ఉపాయాలు ఉంటాయి.. నువ్వే ప్రయత్నం చేసి చూడాల
సాలమ్మ: నేనా?!
చంద్రయ్య: ఇప్పుడు పెద్దగా సదువు కోపోయినా ..పల్లెల్లోవోళ్ళు..కూడా..ఎన్నో విషయాలు కనిపెడుతున్నారు..అవసరం మడిసికి ఎన్నో నేర్పిస్తాది.. నీకు ఏది అవసరమో నీకే బాగా తెలుస్తాది..

సాలమ్మ: అంతే గదూ
చంద్రయ్య: మరి ఒకవేళ నువ్వు ఏదైనా .కనిపెట్టావనుకో..ఆహా..అనుకో...చిన్నదైనా..మా పొలంలో ఫలానా పురుగోచ్చినాది..ఫలానా ..ఆకు కషాయం ..మంచిగా పని చేసినాది..ఆ విషయం ..నువ్వు మొహమాటం లేకుండా..నలుగురికీ చెప్పచ్చు..
నరసమ్మ: నాలుగ్గోడల మద్దా ఉండేది..ఇది నలుగురికీ ఎట్టా సేప్తాది..
చంద్రయ్య: మనసుంటే మార్గమదే ఉంటాది..కొద్దో ..గొప్పో సదువుకుందికదా .. అది దాని పొలంలో తెలుసుకున్న విషయాలు ఒక పుస్తకంలో రాసి పెట్టుకోవచ్చు.. ఈ రోజే డైరీలోనో లేదా పుస్తకంలోనో రాసుకోవచ్చు..
నరసింహం: మనూర్లో ఏ మీటింగులప్పుడో .. అందరూ.. ..వచ్చినప్పుడు .. కలిసినప్పుడు ..వాటి గురించి మాట్లాడుకోవచ్చు..
చంద్రయ్య: ఇప్పుడు కంప్యూటర్లు కూడా వచ్చినాయ్ గా బాబాయ్ ..ఎక్కడెక్కడ వాళ్ళూ ..వాళ్ళ ..వాళ్ళ ..అనుభవాలు ఎందరితోనో పంచుకోవచ్చు.. మనం ఏ పనైనా..ఆ..ఇదేం జరుగుద్దిలే అని వదిలెయ కూడదు బాబాయ్..ఇది..జరగాల..దానికి.. నేనేం చెయ్యాల..అని ఆలోచించాల
నరసింహం: ఈ ముచ్చట్లు..సెప్పుకోడానికి బాగుంటాయి కానీ ...సెయ్యాలంటేనే ఇబ్బంది...అయినా ఇట్టాంటియన్నీ గోరంతలు ..కొండంతలు ..చేస్తారులే చంద్రయ్యా…
చంద్రయ్య: మంచి విషయాలు గోరంతలు కొండంత చేసినా మంచిదే బాబాయ్ ...కానీ ఇదిగో పులి..అంటే ..అదిగో తోక… అనే చెడ్డ మాటలే ...రైతులను మరింత దిగతీసేది..ఆశ ఉండాలి బాబాయ్ ...ఆ ఆశే మనిషిని బతికిస్తుంది..





సాలమ్మ: నిజమే చంద్రయ్యా ..ఆశే మడిషిని బతికిస్తుంది…మన సమస్యలే మనకు పాఠాలు నే ర్పిత్తాయ్
నరసింహం: మొత్తానికి రెండువేల పది మనకు పాఠాలూ, గుణపాఠాలూ సాలానే నేర్పినాది...ఇక రాబోయే సంవచ్చరం మనందరకూ బాగుండాల..
నరసమ్మ: కొత్త సంవత్సరం మనందరం బాగుండాల. పాడీ, పంటా మంచిగుండాల ..
చంద్రయ్య: అందరికీ తిండి పెట్టే అన్నదాతులు సంతోషంగా ఉన్నప్పుడే లోకానికంతా సంతోషం
సాలమ్మ: మనందరం ..ఇట్టా ధైర్నేంగా ..ముందుకు పోతుంటే ..ముందున్న కాలమంతా మంచిదే ..

Sunday, December 26, 2010

అమ్మ కడుపు చల్లగా...

Following is a short play focusing on farmer deaths and farmer suicides. It intends to instill a sense of boldness to face adverse situations and take necessary precautions..

This is how the play goes...

A young woman farmer, Saalamma goes to see her friend Narasamma on her return from her native place. Saalamma narrates with enthusiasm how Venkatesh performed the wedding of his daughter with great pomp after he reaped good benefits from his cotton crop. Saalamma feels bad that she had not gone for cotton crop that year because Narasimham, Narasamma's husband has advised them not to venture for any cash intensive crops.

Narasimham reiterates the need to avoid any possible risk and urges her to adopt low external input way of farming. He alerts Saalamma to the potential dangers of going in for capital intensive agriculture. Narasamma advises her to concentrate on the upbringing of her children, plant more diversity for family's nutrition. She asks Saalamma not to be over-concerned about the education of her children. She emphasizes the need for skill development and suggests that she, together with her children could start some income generation activities to support the income from their farm.

Saalamma is convinced about the ills of taking risks but is skeptical if her husband would heed her advice. Narasammaa retorts with ire saying that men are ignoring their words of caution and venturing into risky businesses; and taking to alcoholism and losing lives when their aspirations and dreams doom.

During the conversation Narasamma tells how her relatives lost everything they had, due to floods that year. Narasimham puts the problem in perspective, bringing in the larger picture of climatic change, species extinction and potential natural disasters. He warns them to be prepared to face any kind of situation, and make every effort, such as crop diversification, crop insurance, life insurance, to guard against risks. The play concludes with the three becoming poised to face the year 2011, wishing for happiness and peace.


సాలమ్మ: నరసమ్మత్తా...ఓ నరసమ్మత్తా.. ...నరసమ్మత్త..ఇంకా ఊర్నించి రానట్టుగా ఉందే.
నరసమ్మ: ఎవరూ సాలమ్మా…రా...
సాలమ్మ: ఇంకా ఊర్నించి వచ్చినావో ..లేదో అనుకుంటుండా ...ఇదిగో నరసమ్మత్తా...నువ్వు ఊరిలో లేకపోతివి గానీ ...ఆ ఎంకటేశు లేడూ ..కూతురి పెళ్లి ఎంత బాగా చేసినాడనుకున్నావ్..
నరసమ్మ: అవునా... మంచిది..
సాలమ్మ: ఈ సంవత్సరం ఆ ఎంకటేశుకి పత్తిలో బాగా కలిసొచ్చినాదంట...దెబ్బకి ..దశ తిరిగిపోయిందనుకో..
నరసింహం: తిరిగిపోద్ది..తిరిగిపోద్ది...ఆడికేం...ఆడు యాపారస్తుడూ...పెట్టుబడి పెట్టాగలడు...అదును, పదునూ చూసి సరుకు అమ్మాగలడు..
సాలమ్మ: నరిసిమ్మావా ..నువ్వాపకుండా ..ఉంటే మేమూ..పత్తే ఏసేటోల్లం. ఎంకటేశు కూతురి పెళ్ళికి బంగారు నాంతాడు...ఏస్కోని పోయేదాన్ని...ఆ..
నరసింహం: బంగారు నాంతాడు...ఏస్కోని నువ్వు పొయ్యేదానివో...లేక...ఆడే పోయి..నీ..తాడు..తెగేదో ...ఎవురికి ఎరుక?
నరసమ్మ:..ఏందయ్యా...ఆ మాటలు..అదేదో తెలియక అన్నాది...మనం ఏం సెప్పినా ..దాని మంచి కోసమే కందా...
నరసింహం: అది అట్టనుకుంటే కదా...మనవల్ల నష్టపోయినామంటే ..నాకు సిర్రెత్తుకొచ్చినాది.
సాలమ్మ: మాకున్నది ఈ పోలమే గందా మావా..ఎదుగూ..బొదుగూ..లేక...ఆ..జొన్నలూ, శెనగలే ఏసుకోవాలంటావా ..
నరసింహం: మీకు ఆధారం ఈ పొలమొక్కటే కందా.. అందుకే ఇంకా జాగ్రత్తగా ఉండాల.. ఎటు పోయి ఎటొచ్చినా.. .మనకు లాభం రాకున్నా సరే నష్టం మాత్రం రాకుండా చూసుకోవాల..అప్పు చేసి ఎవసాయం చేస్తే ...పంట మునిగితే ..ఆ వడ్డీలు పెరిగి మనమూ మునిగినట్టే. అందుకే అంత పెట్టుబడి అవసరం లేని పంటలే ఏసుకోవాల.
నరసమ్మ: అయినా….జొన్నలూ, శనగలూ ఏసుకుంటే తప్పేటంట...ఒక్క జొన్నలూ, శెనగ లేందీ..రాగులూ ..కందులూ గూడ..ఏసుకో..నాలుగు..కోళ్ళూ ..నాలుగు మేకలూ కూడ పెంచుకో...ఇయ్యన్నీ ఇంటికీ..వంటికీ మంచియి.
సాలమ్మ: ఇంటికీ ..వంటికీ మంచిదైతే సరిపోద్దేటి. ఇయ్యాల రేపు నాలుగు రాళ్ళు సంపాదించకపోతే ఎట్టాగా ...
నరసమ్మ: సాలమ్మా లక్షల గురించి ఆలోచించకుండా ..లక్షణంగా ఉన్నంతలో పిల్లల్ని సక్కంగా సాక్కో ..
సాలమ్మ: అవును నరసమ్మత్తా ...నా ఆశలన్నీ పిల్లలమీన్నే ..ఎట్టాగైనా.. ఈళ్ళని పెద్ద పెద్ద సదువులు సదివించి మంచి కొలువుల్లో సూడాల

నరసమ్మ: ఇదిగో సాలమ్మా..ఎంతసేపూ సదువూ..సదువూ అని ఆళ్ళని సతాయించమాక. అస్తమానూ సదవమంటే ఆల్లకి సదువంటేనే ఇసుగు పుడతాది..ఏదైనా..పనీ పాటా కూడా నేర్పించు..కుట్లో ..అల్లికలో.. వడియాలో, ఒరుగులో ఏదో ఒకటి..నేర్చుకుంటే నీకు సహాయంగా ఉంటారు. మీరందరూ కలిసి ఏ పని చేసుకున్నా అంతో ఇంతో వస్తాది.. ఏన్నీల్లకు చన్నీళ్ళుగా ఆళ్ళ ఫీజులకీ, పుస్తకాలకీ అయినా కలిసోస్తాది.
నరసింహం: ఈ రోజుల్లో సదువంటే మాటలా...ఆళ్ళ సిన్నప్పుడే తాహతుకి మించి సదువుల మీన పైసలు పెట్టి అప్పుల పాలు గావద్దు..అయినా..ఆ ఉద్యోగాలూ అట్టనే ఉండాయి. అంతలో వస్తున్నాయి..అంతలో పోతున్నాయి..మనం పిల్లలకి ముందు ధైర్యం నేర్పించాల, కష్టపడే అలవాటు చేయాల..
సాలమ్మ: అంతేలే మనం చేసేది చెయ్యాల…ఆపైన...ఆ సామి దయ..
నరసింహం: అద్గదీ.. పిల్లలైనా అంతే పంటలైనా అంతే ..మనం చెయ్యవలసినదంతా ..సెయ్యాల..ఆ పైన..ఓ సంవత్సరం మంచిగుంటాది.. ఓ సంవత్సరం ముంచుతాది. మనం ధైర్యంగా నిలబడాల...అంతేగానీ ..బెంబేలు పడి ...ఉసురు తీసుకుంటే ఆ భార్యా బిడ్డలకి దిక్కెవరు..
నరసమ్మ: పంట పొతే పాయె ..మడుసులన్నా దక్కాల కదా..బతికుంటే ...బలుసాకుతినచ్చు అంటారు..కాలమెప్పుడూ ఒక లాగ ఉండదు కందా..
సాలమ్మ: అంతేలే ఓర్పుతో ఉంటే మంచి రోజులు రాక పోతాయా

నరసింహం: ఓర్పు ఒకటీ సరిపోదు సాలమ్మా...నేర్పు కూడా కావాల. మన పంట విషయమే తీసుకో..ముందు మన వాతావరణానికి ఏ పంటలు సరిపోతాయో తెలుసుకోవాల. ఏదో …ఒకటో ..రెండో పంటలు యేసి దేవుడా ..నీదే భారం అని సేతులు ముడుసుకుని కూచోరాదు...వీలైనన్ని రకాల పంటలు వెయ్యాల. ఒకటి ముంచినా వేరొకటి వస్తాది.
సాలమ్మ: ఒక రకం విత్తనాలు కొనడానికే పైసల్లేకపాయే..ఇంక ..ఇన్ని రాకాలేడ్నుంచి తేవాలా..
నరసింహం:..యాడ్నుంచో కాదు సాలమ్మా ..నీ పొలంనుంచే..కాకపొతే ఇంకోరి పొలం లోంచి..నువ్వు దాచిన విత్తనాలు వాల్లకిస్తే ..వాల్ల విత్తనాలు నీకిస్తారు...
సాలమ్మ: మరి మన పొలాల్లో విత్తనాలు పనికొస్తయంటావా?
నరసమ్మ: మన తాత ముత్తాతలంతా అయ్యే ఏసేవారుగా...
సాలమ్మ: ఆ రోజులు వేరు...ఈ రోజులు వేరు.కదా.నరసమ్మత్తా
నరసమ్మ:..అదీ నిజమే అనుకో ..కాకపొతే నువ్వు దాచుకున్న విత్తనాలైతే వెంబడే ఏసుకోవచ్చు..పైగా..విత్తనాలు కొనే ఖర్చు కూడా ఉండదు.
నరసింహం:..అంతే కాదు..మోసపోయి ..పంట మొత్తం పోగొట్టుకునే పెమాదం ఉండదు. అట్టాగే ఎరువులు కూడా అవసరమైన మేరకే ఉపయోగించాల ...పచ్చి రొట్ట పైర్లతో, ఆకెరువుతో, వానపాము ఎరువుతో భూసారాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాల కానీ, అప్పు చేసి ఎరువులను కొనరాదు..
సాలమ్మ: ఎరువులగన్నా కూడా...ఈ పురుగు మందులు కొట్టడానికే చానా పైసలు పోతున్నాయి మామా
నరసింహం:..అంతే కదా మరి..ఎవరో చెప్పారనో..లేదా పంట పోతుందేమోనన్న భయంతోనో ...అవసరమున్నా లేకున్నా..పిచికారీలు చేస్తే ఖర్చు పెరుగుద్ది ...విత్తనం వేసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ది చేసుకుంటే ..చాలా వరకూ మనం పంటను కాపాడు కోవచ్చు.. తరువాత కూడా.. పైరును జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే - గుడ్డు దశలోనూ, పిల్ల పురుగుల దశలోనూ చేతితో ఏరి పారేసి కొంత వరకూ పంటను కాపాడుకోవచ్చు...పిచికారీ అవసరమైనప్పుడు కూడా.. రసాయనిక పురుగు మందులు కాకుండా...స్థానికంగా లభించే మొక్కల కాషాయాలని వాడుకోవాలి.
సాలమ్మ: అట్టాగే నరిసిమ్మావా..ఈ పాలి మా పొలాన్నీ, పంటలను కూడా ..మా పిల్లల్లాగే ..సక్కగ..సాక్కుంటాలే...కానీ నరిసిమ్మావా..ఎంకటేశుని చూసి మా ఇంటాయన కూడా పత్తి, మిరప పెట్టాలని చూస్తున్నాడు...మనకీ ఆడపిల్లలున్నారు..మనమూ ఆళ్ళ పెళ్ళిళ్ళు ఘనంగా చెయ్యాలని ఒకటే ఇదైపోతున్నాడు..
నరసింహం: కూతుళ్ళకి ఘనంగా పెళ్లి చెయ్యాలన్నఆశ తండ్రికి ఆమాత్రం ఉండదేటి?.. కానీ ఆ ఆశే ..నిరాశగా మారితే ..కష్టం కదా..అందుకే మనం అట్టాంటి పంటల జోలికి పోవడం మంచిది కాదు..
సాలమ్మ: మరి నేను వెయ్యద్దని సెప్తే ఇంటాడో లేదో...

నరసమ్మ: ఈ మొగాళ్ళ మాట ఇంటూ కూర్చుంటే అయినట్టే. ముందంతా ..నీకేం తెల్దు...నీకేం తెల్దంటూ...ఎవసాయం అని, యాపారం అని ఉన్నదంతా తగలేసి ...ఆ తర్వాత ఏదైనా ఎదురు దెబ్బతింటే ...సారా మత్తులో పడిపోతారు. ఆళ్ళ నుంచి సాయమందుతాది….ఈ డబ్బు చేతికొస్తాది అని ఎదురు చూసి చూసి..అది రాదు అని తెలిసినప్పుడు ..గుండాగి పోవడమో ...లేదా బలవంతంగా ప్రాణాలు తీసుకోవడమో జరుగుతుంది. అప్పుడు ఆ ఉన్న అండ కూడా పోయి ఎటూకాని పిల్లలతో మనమే అవస్థ పడాల.
సాలమ్మ: హమ్మో ఇనదానికే భయమేస్తావుందత్తా ... అట్టాగైతే నాకు నాపిల్లలకి దిక్కెవరు దేవుడో..
నరసింహం:..ఇదిగో మీరిట్టా ..బెంబేలు పడతారనే ..ఆళ్ళు మీకు ఏ సంగతీ చెప్పరు..
నరసమ్మ: ఆ..ఆ..సెప్పా పెట్టకుండా..సచ్చిపోవడం మాత్రం బాగుందేటి ... ఏం చేస్తాం సాలమ్మా చాదస్తం మొగుడు సెపితే ఇనడు అన్నట్టు...మనమే పిల్లలకి చెప్పినట్టు మెల్లగా నచ్చచెప్పుకుంటూ పోవాల. మన చేతిలో ఉన్నంతవరకూ కష్టపడి చేసుకుంటూ పొతే ..కొన్ని దినాలకు ఆల్లే అర్ధం చేసుకుంటారు..
సాలమ్మ: మంచి మాట సెప్పినావ్ నరసమ్మత్తా....అట్టాగే సేద్దాంలే ...ఊర్లో అంతా బాగున్నారా..
నరసమ్మ: ఏం బాగులే సాలమ్మా ..ఈ సంవచ్చరం వచ్చిన వరదలకి మావోల్లంతా బాగా దెబ్బతిన్నారు...ఎవసాయం ఎర్రోని చేతిలో రాయిలాగైపోయినాది….ఎటుపోతుందో తెలియదు .. ఏమైతాదో తెలియదు …అతివృష్టి ..అనావృష్టి.....అనావృష్టికైనా ..ఉపాయాలున్నాయేమో కానీ ..ఈ అతివృష్టి తో అంతా ..తుడిచిపెట్టుకుపోయినాది … ...ఆల్లకేదో ధైర్యం సెప్పాను కానీ ...ఆళ్ళ పరిస్థితి తల్సుకుంటే నాకే గుబులుగా ఉంది...(ఏడుపు)
సాలమ్మ: ఊరుకో నరసమ్మత్తా ...అంతా సర్దుకుంటాదిలే.. ఇది.. .మీ వోల్లొక్కరికే వచ్చిన పరిస్థితి కాదు...ఈ సంవచ్చరం..శానామంది పరిస్థితి ఇట్టానే ఉంది..గవర్నమెంటోల్లు ఏదో సాయం సెయ్యకపోరులే
నరసమ్మ: మారాజుల్లాగా ఉండేవోళ్ళు ...మా రైతులే రాజులం ..మాకు కొలువు లెందుకనేవారు...ఇప్పుడు ఎవసాయం పరిస్థితి చూస్తే ఎవసాయం సెయ్యలని ఎవ్వురూ అనుకోరు...
నరసింహం: ఎవ్వరూ ఎవసాయం సెయ్యకపోతే ..మరి మడుశిలేట్టా బతకాలా .. అందుకే ఇది ఇప్పుడు మన ఒక్కరి సమస్యా కాదు.. . దేశం మొత్తం మీద పరిస్థితి ఇట్టాగే ఉంది…ఒక్క మనదేశంలోనే కాదు..అన్ని దేశాలలో ప్రజలూ ఇట్టాంటి ప్రకృతి వైపరీత్యాల వలన అనేక రకాల కష్టాల పాలౌతున్నారు...మనుషులే కాదు…ఈ వాతావరణంలో వచ్చే పెద్ద పెద్ద మార్పులకు కొన్ని జాతుల మొక్కలూ, జంతువులూ కూడా అంతరిస్తుండాయ్.
సాలమ్మ: అట్టాగా...ఈ ఇపరీతమైన ఎండలకీ ..వానలకీ మడుసులే బతకట్లేదు…ఇంక మొక్కలేం బతుకుతాయ్ ..
నరసింహం: అందుకే మనం ఇట్టాంటి విపత్తులను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాల...జీవిత భీమాలు, పంట భీమాలు సేయించుకోవాల, దిగుబడి బాగా వచ్చినప్పుడు మంచి ధర చూసి అమ్ముకోవాల ...సరుకు పాడవకుండా ...మంచి గిడ్డంగులను, శీతల రవాణా సౌకర్యాలనూ అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవాల…
నరసమ్మ: ముఖ్యంగా లాభాలొచ్చినప్పుడు ఆ డబ్బును అవసరానికి అందివచ్చేలాగా జాగ్రత్త చేసుకోవాలి. అంతేగానీ ఏ వ్యాపారంలోనో ..అధిక వడ్డీకి ఆశపడో పోగొట్టుకోకూడదు. నరసింహం:... ఏది పోయినా ..మనం ధైర్యాన్ని మాత్రం అస్సలు పోగొట్టుకోకూడదు… అయినా కష్టాలు లేనిదెవరికీ..
సాలమ్మ: అంతేలే ...మన సమస్యలే మనకు పాఠాలు నే ర్పిత్తాయ్
నరసింహం: మొత్తానికి ఈ రెండువేల పది మనకు పాఠాలూ, గుణపాఠాలూ సాలానే నేర్పినాది...ఇక రాబోయే సంవచ్చరం మనందరకూ బాగుండాల..
నరసమ్మ: మనందరి కష్టాలూ తీరిపోవాలనీ…
సాలమ్మ: సంతోసంగా, శాంతిగా ఉండాలనీ కోరుకుందాం..

Monday, November 1, 2010

నేల తల్లి నీల్లోసుకున్నాది

భూమి: అమ్మా ...అమ్మా...నేను వనజక్క వాళ్ళింటికి వెళ్తున్నా ...
లచ్చమ్మ: అవునే భూమీ మర్చిపోయినా..ఈ రోజు దాని సీమంతం కందా
సావిత్రమ్మ: మన భూమి తల్లికే ఇంకా సీమంతం ముచ్చట లేదాయె
అంజయ్య: నువ్వూరుకోయే అమ్మా ...అది పట్నం నుంచి నిన్ననే వచ్చినాది...నువట్టా అంటుంటే రేపే ఎల్లి పోతుంది ..
అమ్మా బుజ్జమ్మా నువ్వు తొందరగెల్లి తొందరగొచ్చేయ్. అవునూ, ఏందదీ, ముఖానికీ, గొల్లకీ రంగులేసినా? మొన్న మొన్నటి వరకూ పొలంలోని పసుపూ, పెరట్లోని గోరింటాకుతో లచ్చిందేవిలాగ ఉండేదానివాయే.
సావిత్రమ్మ: మరదే పులిని జూసి నక్క వాత పెట్టుకోవడమంటే
లచ్చమ్మ: అల్లుడిది పెద్దుద్యోగం కందా.. వాళ్ళ ఆఫీసోళ్ళతో ఎల్లినప్పుడు ఎసుకోనుంటాది
అంజయ్య: అదేలే అప్పుడప్పుడు ఏదో అవసరానికి ఎసుకోవచ్చుకానీ ...అయిందానికీ కానిదానికీ అట్టాంటివి వాడకూడదు. అప్పటికి బాగానే అనిపిచ్చినా ... వంటికి మంచివి కాదు. సరేలే.. భూమి తల్లీ నువ్వెళ్ళి రా ..పొద్దు గుంకుతాంది.
లచ్చమ్మ: బుజ్జమ్మ వచ్చిన కాడ్నుంచి చూస్తుండా ...పైకి డాబుగా తిరుగుతున్నా మొఖంలో కళే లేదు.
సావిత్రమ్మ: విరిగిన కత్తి కమ్మరింటికి - మనువు చెడితే పుట్టినింటికి , అల్లుడిమీద అలిగొచ్చినట్టున్నాది ...యవ్వారం చూస్తే...ఇక్కడ సాన్నాళ్ళే ఉండేలాగ ఉంది..
లచ్చమ్మ: పోనీలే అత్తమ్మా ..అట్టాగైనా భూమి మన కాడ కొన్ని దినాలుంటే కాస్త దాని ఆరోగ్యం మళ్ళీ కుదురుకుంటాది...ఏదైనా చిన్న చిన్న గొడవలుంటే మెల్లిగా అల్లుడుకి నచ్చ చెప్పచ్చులే
సావిత్రమ్మ: అదీ నిజమేలే ..ఇదివరకు రోజుల్లో కూడా..పురుడనీ పున్నెమనీ పుట్టింటికి వచ్చి ..కాస్తంత బలం పుంజుకుని ..మళ్ళీ కాపరానికి పోయే టోళ్ళు * * * *
అంజయ్య: అమ్మా భూమీ .. పేరంటం బాగా జరిగినాదా.. మీ స్నేహితురాల్లను కలిసినావా..
భూమి: అందురూ కలిసినారు గానీ జ్యోతి మాత్రం కలవలే. వాళ్ళయనకు డిల్లీ బదిలీ అయ్యిందంట. వాళ్ళమ్మ చెప్పినాది. పాపం పెద్దమ్మని చూస్తే జాలేసినాది నాయనా. కొడుకులెవ్వరు ఆమెను సరిగా చూడటం లేదంట. ఆమె ఆలనా పాలనా చూసే వాళ్ళు లేరు. రోగమొస్తే బాగుచేసే వారు అంత కన్నా లేరు. పైపెచ్చు ఆ మిగిలిన మూడెకరాలూ కూడా అమ్మేసి డబ్బులిచ్చేయమంటున్నారంట.
సావిత్రమ్మ: కలి కాలం… తల్లి నుంచి తీసుకునే వారే కానీ ఆ తల్లికి తిరిగి ఇచ్చే వారు లేరు ఈ కాలంలో ...అందరికీ డబ్బు.. దయ్యం పట్టినాది.. ఒక్క డబ్బేనా.. ఎప్పటికీ ఉండే సంబంధ బంధాలు కూడా వద్దూ.. అయినా ఉన్న నాలుగు ఆస్తిపాస్తులు అన్నీ ఇప్పుడే వాడేసుకుంటే పుట్టబోయే మనుమలు ఏమి తింటారు.. వీల్లనేమి చూస్తారు..
లచ్చమ్మ: వాళ్ళు మాత్రం ఏం చేస్తారత్తమ్మా .. వాళ్ళ చదువులూ.. వాళ్ళ కొలువులూ.. వాళ్ళ పనులు వాళ్ళవి..
సావిత్రమ్మ: ఆ.. ఎన్ని పనులుంటే మాత్రం కన్నతల్లినీ, నేలతల్లినీ అలక్ష్యం చేసి బాగుపడేటోడే లేడు..ఆ..
అంజయ్య: అవునే అమ్మా.. నేను తల్లిని చూసుకుంటున్నాగానీ ..నువ్వు చెప్పినట్టు నేలతల్లి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదే.. మన భూమి తల్లి పెళ్ళికి చేసిన అప్పుతీర్చాలన్న తాపత్రయంతో పంట తర్వాత పంట యేస్తున్నా, ఎరువులేస్తున్నా, మందుకొడుతున్నా ..ఫలితం మాత్రం సున్నా.. ఇట్టాగే యేసుకుంటూ పొతే అప్పు తీరడం కాదు కానీ ..ఈ పెట్టిన పెట్టుబడికి ..కొత్త అప్పులయ్యేటట్లున్నాది.
సావిత్రమ్మ: నిజమేరా అబ్బాయ్ నా మాటిని ఈ సారి ఏ పంట జోలికీ పోమాకు. చేనును బీడుగానే అట్టిపెట్టేయ్. అప్పుడే భూమికి సత్తువోస్తాది..
అంజయ్య: సరే అట్టాగే సేద్దాం..
భూమి: అవును నాయనా ఎక్కువ దిగుబడి సాధించాలన్న ప్రయత్నంలో మనం తక్కువ కాల పరిమితి కల సంకర జాతి వంగడాలనూ, ఎకరానికి 2 -3 పంటల్నీ పండిస్తున్నాం. అయితే సాధారణంగా అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు భూమి నుండి పోషకాలు కూడా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వలన నేలకు ఆయా పంటలకు కావలసిన పోషకాలను సరఫరా చేసే సామర్ధ్యం క్రమేసి తగ్గిపోయి పోషక పదార్ధ లోపాలు తలెత్తుతున్నాయి.
అంజయ్య: అందుకేనేమో మనకి దిగుబడి సరిగా రావట్లేదు .. ముందు మన భూమిని బాగుచేసుకోవాలి...
భూమి: అయితే ఈ సీజను మన పొలానికీ నాకూ కూడా విశ్రాంతే
సావిత్రమ్మ: మనిషన్నాక కాస్తంత విశ్రాంతి ఉండాల... అయినా మనిషికీ మన్నుకీ తేడా ఏటుందీ
---------------------------------------------
రాఘవయ్య: అంజయ్యా .. అంజయ్యా ... బాగుండావా ..మన బుజ్జమ్మ వచ్చినాదంటకదా. ఎల్లమ్మ చెప్పినాది. సూసిపోదామని వచ్చా
అంజయ్య: రాఘవయ్యా.. రా ..రా.. ఇట్టా కూర్చో.. మంచి ఎండన పడి వచ్చినావ్...అమ్మా భూమీ ..రాఘవయ్య మామకు కాసింత మజ్జిగ తీసుకు రా..
రాఘవయ్య: ఈ ఎండదేముందిలే అంజయ్యా మనం యెవసాయదారులం ..ఈ ఎండకే…బెదిరిపోతామా…పోయిన ఎండా కాలం పడ్డ శ్రమకి ఇప్పుడు ఫలితం కనిపిస్తోంది. యేసంకాలంలో భూమి ఖాళీగా ఉంటది కదా లోతుగా ట్రాక్టరుతో దున్నించా.
సావిత్రమ్మ: ఎవరూ రాఘవయ్యా.. బాగుండావా ..ఏమిటీ ట్రాక్టరు..దున్నడం అంటున్నావు..
రాఘవయ్య: ఏం లేదు పెద్దమ్మా భూమిని బాగా గుల్లగా దున్నితే ...నీరు బాగా ఇంకుతుంది కదా..అదీ చెప్తున్నా
సావిత్రమ్మ: ఇందులో కొత్తేముందీ దున్నుతూ వుంటే నాగళ్ళు - పారుతూ ఉంటే నీళ్ళు అనే సామెత ఉండనే ఉంది కదా.
రాఘవయ్య: మట్టి నమూనాలు కూడా తీసి పంపించా .. ఆ ఫలితాల బట్టే ఆ పరీక్షా కేంద్రం వారు చెప్పిన మోతాదులో ఎరువులను వేసా. దీనివల్ల మంచేమిటంటే కేవలం అవసరమైన మేరకే ఎరువులను వాడతామన్నమాట. అంతేకాక ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేతికందిన ఎరువును బస్తాలు బస్తాలు ఎయ్యకుండా, మన భూమి సంగతేంటో సరిగ్గా తెలుసుకుని మరీ ఏస్తాం. అసలు మన మట్టి ఎలాటిది.. ఏదైనా.. ఎక్కువైనాదా…లేక మరేదైనా తక్కువైనాదా...అన్నీ ఇవరాలు తెలుస్తయంట.. ఆ పరీక్ష చేస్తే..
అంజయ్య: అంటే మన రక్త పరీక్షల్లాగానే ...
సావిత్రమ్మ: నే చెప్పలేదూ మనిషైనా మన్నైనా ఒకటేననీ..
రాఘవయ్య: అవును పెద్దమ్మా .. మన రక్త పరీక్ష రిపోర్టు లాగానే భూ ఆరోగ్య కార్డు అని ఉంటది..
భూమి: బాగున్నారా మామయ్యా... మజ్జిగ తీసుకోండి మామయ్యా
రాఘవయ్య: ఆ..ఆ..బాగుండావా భూమి తల్లీ... రా..కూర్చో ..నీ గురించే మాట్లాడుకుంటున్నాం..
భూమి: నా గురించా..
రాఘవయ్య: నీ గురించి అంటే ..అచ్చంగా నీ గురించి కాదనుకో.. పొతే మన భూమి గురించీ, భూసారం గురించీ..
ఇదుగో ఇది భూ పరీక్షలు జరపడానికి నమూనాలను ఎలా తియ్యాలో చెప్పే కర పత్రం.. ఓ సారి దీని గురించి మన స్కూల్లో పిల్లలకు చెప్పు...ఎప్పుడూ పుస్తకాల్లో చదువే కాదు .. కాస్త పొలాల గురించి కూడా తెలుసుకోవాలిగా..
భూమి: అవునవును... ఇదీ వాళ్ళకో సైన్సు పాఠం లా ఉంటుంది.. సరదాగానే సేకరిస్తారులే ఈ నమూనాలను…
రాఘవయ్య: నువ్వైతే ఇలా సరదాగా చెప్తావు... నువ్వెళ్ళే లోపు ఓసారి వాళ్లకు ఈ భూసార పరీక్షల గురించీ, వాటి అవసరం గురించీ, నమూనాలు ఎలా సేకరించాలి, ఈ మట్టి నమూనాల సేకరణలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటీ అన్న విషయాలు మన పిల్లలకూ, రైతులకూ కూడా ఓసారి చెప్పు తల్లీ
భూమి: అట్టాగే పెద్దనాన్నా ..నువ్వంతగా చెప్తే నే కాదంటానా ...ఇంకా ఉంటాలే...ఇక్కడే ..సరే వస్తా పెదనాన్నా ఆమ్మకి వంటింట్లో సాయం చేస్తున్నా…
---------
రాఘవయ్య: అంజయ్యా ...అదేంటీ అమ్మాయ్ అదో రకంగా ఉంది.. కొంప తీసి ..అత్తోరితో పోట్లాడి కానీ వచ్చేయలేదు కదా...ఇదుగో నేను సేప్తున్నననీ ఏమీ అనుకోబాక .. ఎక్కడుండే వాళ్ళు అక్కడుండాల...
అంజయ్య: అదేం లేదు గానీ .. . అమ్మాయికి ఒంట్లో కొద్దిగా తేడా వచ్చినాది.. అదేదో అయోడిన్ అంట.. . దాని లోపం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బ తింటాదంట. అందుకే కొద్ది దినాలు అమ్మాయిని మా కాడుంచుకుంటే మంచిదని..
రాఘవయ్య: అట్టైతే సరేలే అంజయ్యా ...ఒక ఇద్దరు పిల్లలు పుట్టాక మనకి అంత భయముండదు...ఒంటరి కాపరాలంటే ఇడిపోయే ప్రమాదం ఎక్కువ. ఇప్పుడు చూడు మన భూమి చెట్లతో, పొదలతో నిండి ఉన్నప్పుడు మనకు నేలకోత భయం ఉండదు.
అంజయ్య: నేలకోత అంటే ఏమిటి రాఘవయ్యా
రాఘవయ్య: నేలకోత అంటే ఏటంటే ... నేల అణువులు ఏదైనా కారణం వలన తమ స్వస్థానాల నుండి విడివడి పోయి వేరే చోటుకు కదిలిపోతే కోత ఏర్పడుతుంది. వాన చినుకులు నేలను తాకినప్పుడు భూఅణువులు నేల నుండి విడిపోయి పారే నీటిలో కొట్టుకు పోతాయి. ప్రవాహ మార్గంలో రాళ్ళ వంటివి లేకపోతే కోత మరింత అధికంగా ఉంటాది. వాన నీరు భూమి లోనికి ఇంకదు. భూమి పైనుంచి ఏ(వే)గంగా ప్రవహించి ఎ(వె)ల్లి పోతుంది. అలా చిన్న చిన్న కాలవల్లాగా ప్రవహి స్తూంటే కొన్ని రోజులకి నేలపై బొరియలు ఏర్పడతాయి. దీన్నే నేలకోత అంటారు. ఇలా నేలలోని సారవంతమైన అణువులు నదులలోకి, ఆకాడ్నుంచి సముద్రంలోకి కొట్టుకు పోతాయ్. అయితే పల్లం వైపు నీరు మరింత వేగంగా ప్రవహించడం వలన బొరియలు మరీ లోతుగా ఏర్పడతాయి
సావిత్రమ్మ: ఈ కధంతా సెప్పకపోయినా మన పెద్దోళ్ళు పల్లము దున్నిన వాడు పల్లకి ఎక్కుతాడు అని ఒక్క ముక్కలో చెప్పేశారు
రాఘవయ్య: మా సామెతల పెద్దమ్మ మాటకొక సామెత సెప్తాది
సావిత్రమ్మ: మాటకొక సామెత కాదు రాఘవయ్యా మాటకు మూడు నాలుగు చెప్తా ..సామెతలు..ఆ..
భూమి: నాయనమ్మా ఏదీ సూద్దాం దుక్కి మీద ఇంకో సామెత చెప్పు
సావిత్రమ్మ: నా మనమరాలికి కూడా సామెతలంటే ఇట్టవే. నా సామెతినగానే వంటింటిలోంచి వచ్చేసినాది. ఇంకో సామెత
సెప్పలేననుకున్నావా … ఇనుకో …దుక్కి లేని చేను తాలింపు లేని కూర; నాగలి ఉన్న వారిలో ఆకలి చేరదు, పేడ ఎరువు కంటే పిండి దుక్కు మేలు, చాలు పై చాలు దున్నితే చచ్చు నేలైనా పండుద్ది..
నాయనమ్మా నేను కూడా చెప్తా..వేసంగి భూమిని దున్నితే కాసులు ఇస్తుంది
సావిత్రమ్మ: ఈ సామెతెప్పుడూ ఇనలేదే ...నువ్వే కట్టుంటావ్ ..
రాఘవయ్య: పాతదైనా కొత్త దైనా సామెతలాగుంటే అది మనకు బాగా గుర్తుండి పోతుంది కదూ…
అంజయ్య: ఎహే …ఆపండర్రా మీ సామెతలు..మద్దిలోను.. ….అయితే వాన నీటి వల్ల కూడా ఇంత నష్టం ఉందన్న మాట …
రాఘవయ్య: ఒక్క నీటి వల్లే కాదు ..ఏగంగా వీచే గాలి కూడా పెమాదమే. ఈ గాలి తేలికగా ఉన్న నేల అణువులను ఎగరగొట్ట గలదు. ఈ నేలకోత అరికట్టడానికి సాధ్యమైనంత ఎక్కువగా నేలపై పచ్చదనం పైపొరను ఏర్పరచి వర్షాకాలంలో మల్చింగ్ చేయడం … అంటే..నేల మీద ఆకులూ అలాలూ లాంటివి కప్పడం వల్ల కూడా సారవంతమైన మట్టి కొట్టుకుని పోకుండా కాపాడ వచ్చు.
వాలు ఎక్కువ ఉన్నప్పుడు వాలుకు అడ్డంగా దున్నటం, వాలుకు అడ్డంగానే విత్తనాలు వేయడం, వాలుకు అడ్డంగానే అంతర కృషి చేయడం చేయాలి. కాంటూరు గట్లు నిర్మించాలి. లేకుంటే వట్టి వేరు లాంటి గడ్డి మొక్కలతో జీవ గట్లు పెంచాలి.
నీటి పెవాహం జోరుగా ఉంటే నట్టం ఎక్కువగా ఉంటాది. కనుక నీటి ప్రవాహ మార్గంలో ఎక్కువ నీటిని గ్రహించే మొక్కలను నాటడం వలన నీటి జోరు తగ్గడమే కాకుండా మరింత ఎక్కువగా నీరు భూమిలోకి పీల్చుకోబడేటట్లు చేయవచ్చు. గాలి వేగాన్ని తగ్గించడానికి గాలి వాలుకు అడ్డంగా కూడా వరుసలలో చెట్లను పెంచాలి.
సావిత్రమ్మ: అందుకే చెట్లుంటే క్షేమం - లేకుంటే క్షామం అన్నారు
రాఘవయ్య: సరే అంజయ్యా ఇంక నే వస్తా..పెద్దమ్మా ఎల్లొస్తా.. అమ్మా భూమీ రేపో మాపో ఓసారి ఇంటికిరా
----------------------------------------------------
భూమి: అత్తా ...ఎల్లమ్మత్తా
ఎల్లమ్మ: ఎవరూ భూమీ.. రా రా.. నాయనమ్మ అమ్మా బాగుండారా..
భూమి: ఆ. బానే ఉన్నారు.. అవునూ రాఘవయ్య మామ ఏరీ ..
ఎల్లమ్మ: సొసైటీలో ఎరువులేవో ఇస్తున్నారు.. ఆడికి పోయినారు..ఎరువులకి మంచి గిరాకీ కదా.
భూమి: అవును మరి. అందుకే ఎరువులేని పైరు - పరువులేని రైతు అంటారు
ఎల్లమ్మ: సామెతల పెద్దమ్మ మనుమరాలనిపించు కున్నావ్. అవునే భూమీ, నాకు తెలియక అడుగుతాను.. ఇప్పుడెందుకే అందరూ ఎరువులో అని ఎగబడతరు.. ఇంతకు ముందు ఈ ఎరువులున్నాయా ఏంది. మరి అప్పుటోల్లంతా ఏంచేసినారంటావ్
భూమి: కేవలం ఐదు దశాబ్దాల నుండి మాత్రమె మనం రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతున్నాం . అయితే వీటిని ఎలా పడితే అలా వాడడం వలన రసాయన మూలకాలు అవశేషాలుగా మిగిలి పోయి చివరికి తల్లి పాలలో కూడా చేరిపోయాయి. కాబట్టి రాసాయానికి ఎరువుల వాడకాన్ని కొంత తగ్గించి వాటి స్థానంలో సేంద్రీయ ఎరువులను వాడాలి.
ఎల్లమ్మ: సేంద్రీయ ఎరువులంటే ఏందే భూమీ
భూమి: సేంద్రీయ ఎరువులు అంటే జంతువులు మానవులు విసర్జించిన పదార్ధాలు, ఆకులు, వృక్ష సంబంధ పదార్ధాలతో ఏర్పడిన దాన్ని సేంద్రీయ పదార్ధం అంటారు. ఇది నేలకు జీవం వంటిది.
ఎల్లమ్మ: అవునా..అదెట్టాగా?
భూమి: సేంద్రీయ పదార్ధం మొక్కలకు నత్రజని, భాస్వరం, పోటాష్ లు అందిస్తుంది. వీటితో బాటు కాల్షియం, మెగ్నీషియం గంధకం వంటి సూక్ష్మ పోషకాలకు భూమిలో మార్పిడి చేసుకునే శక్తిని పెంచి, పోషకాలను నేలలోనే పట్టి ఉంచుతుంది. నేలలో నీటిని పట్టి ఉంచే శక్తి కూడా పెరుగుతుంది. నేలగుల్లబారి మొక్కల వేళ్ళు బాగా చొచ్చుకొని పోతాయి. ఆమ్లత్వం తగ్గుతుంది. సూక్ష్మ జీవుల క్రియలను ప్రోత్సహించి, సూక్ష్మ జీవుల మధ్య సయోధ్యను పెంచుతాయి.
ఎల్లమ్మ: మరి అంత మంచివైతే మనమూ అయ్యే వేసేయచ్చు కదా..
భూమి: మనమూ వేస్తూనే ఉన్నాం అత్తా ...పశువుల పెంట కూడా సేంద్రీయ ఎరువే. కాకపొతే మనం వాటి అవసరాన్ని అంతగా గుర్తించటం లేదు. పెంట కుప్ప పెరిగితే పేద రైతు పెద్దవాడవుతాడు అని మన పెద్దోళ్ళు చెప్పినా ఏదో పాత కాలం సామెతలే అని కొట్టి పదేస్తున్నాం.
రాఘవయ్య: మరి ఇప్పుడంత పశువుల పెంట యాడ్నుంచి తెవాల? రసాయనిక ఎరువులైతే …కొంటే దొరుకుతాయి.
భూమి: శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. ఇప్పుడు ఇవి కూడా మార్కెట్లలో దొరుకుతున్నాయి మామా...
ఎల్లమ్మ: పశువుల పెంటకేం భాగ్గెం? పాడి ఉంటే పెంట అదే వస్తది.
భూమి: అవును అత్తా.. ముందరి రోజుల్లో ఇలా..ఒక్క పంటో రెండు పంటలో ఏసేటోళ్ళు కాదు. అన్ని రకాలూ పండించేటోళ్ళు ..ఒకదానిలో మిగిలినది మరొకదానికి ఉపయోగపడేది. అందుకే పంట పెంటలో ఉంది - పాడి పూరోలో ఉంది
రాఘవయ్య: అవునే భూమీ, మా సిన్నప్పుడు కొంత పాడి, కొన్ని కోళ్ళు, కొంత వరి, గట్ల మీద కంది, వరి పంట తీసేసాక పెసర, మినుము, చెట్లు, పాదులు అబ్బో...ఎన్ని కూరగాయలు...ఎన్ని రకాల పళ్ళు...సంవత్సరం పొడవునా యాదో ఒకటి కాస్తానే ఉండేది...మేము తింటానే ఉండేవాళ్ళం. .. ఆ రోజులే వేరు.
ఎల్లమ్మ: మళ్ళీ ఆ రోజులొత్తాయంటావా ?
భూమి: రావాలి అత్తా. అవి రావు. మనమే తీసుకురావాల. అట్టా తీసుకువస్తేనే మన భూమికీ మనకూ ఆరోగ్యం. మీరు అనుభవించిన ఆ కాలం .. మీ మనుమలూ, ముని మనుమలూ కూడా చూడాలి అత్తా..కాదంటావా…
ఎల్లమ్మ: అవునే భూమీ, ఆ కాయి..ఆ కసరు, ఆ మట్టి వాసన...అన్నీ తిరిగిరావాల.. అదే నిజమైన ఐశ్వర్యం.
రాఘవయ్య: సరే..సరే.. కబుర్లు.. బాగానే ఉన్నాయ్. అమ్మయికేదైనా తింటానికి పెట్టావా.. పోయి పని చూసుకో..
ఉ..ఉ.. అంతేలే.. మాకెంతసేపు వంటపని.. ఇంటి పనే.. పొలం మీద మా పెత్తనం ఏటైనా ఉందేటి? మా పెత్తనమైతేనా.. పెట్టుబడి..లాభాలు..మాటేమీటోగానీ , కాయీ కసరూ, పాలూ పండూ కి లోటు ఉండేది కాదు… ఆ..
రాఘవయ్య: దాని మాటలకేం గానీ, నువ్వు చెప్పు తల్లీ. ఇంకా ఏవో సేంద్రీయ ఎరువులున్నయన్నావు కదా...ఏందవి
భూమి: అవి చాలా వరకూ మనకు తెలిసినవే మామా.. నూనె చెక్కలు, పచ్చి రొట్ట పైర్లు… పిల్లి పెసర, జనుము, జీలుగ వంటి పచ్చి రొట్ట పైర్లు పండించడం ద్వారా, పచ్చి రొట్ట ఆకును పంట పొలాల్లో వర్షాలు పడే ముందు కలియడున్నడం వల్ల కూడా నేలకు తగినంత సేంద్రీయ పదార్ధం సమకూరుతుంది.
ఇంకా గొర్రెల పెంట, కోడి పెంట… పశువుల పెంట...అందుకే.. పెంట కుప్ప పెరిగితే పేద రైతు పెద్దవాడవుతాడు అంటారు. అబ్బో ఒకటేమిటి ఇంకా ఏవో చాలా రకాలు ఉన్నాయి.. చేపల ఎరువు, ఫిల్టరు మడ్డి…
ఎల్లమ్మ: ఆవు పేడ కూడా శానా మంచిదంటగా
భూమి: ఒక్క ఆవు పేడే కాదత్తా మూత్రాన్ని కూడా ఎరువుగా వినియోగించుకోవచ్చు. ఆవు మూత్రం సాధారణంగా వృధాగా పోతుంది. అలా వృధాగా పోకుండా అక్కడ ఒక తొట్టి కట్టాలి. ఆ తొట్టిలో ప్రతిరోజూ ఉదయం మట్టిని వేసి మరునాడు ఉదయం దానిని తీసివేయాలి. ఈ విధంగా తీసిన మట్టిని మొక్కకు ఒక తట్ట చొప్పున వేస్తె భూమికి మంచిది.
ఎల్లమ్మ: అట్టాగా! ఆవు పేడకి, ఆవు మూత్రానికి అంత ఇలువన్న మాట!
భూమి: మరి అందుకేగా.. అమెరికావాళ్ళు మన గోమూత్రం పై పేటెంటు హక్కులు సొంతం చేసుకున్నారు..
ఎల్లమ్మ: ఏందీ …పేషంటు హక్కా..
భూమి: పేషంటు కాదత్తా ..పేటెంటు.. ఆవు మూత్రం పై పేటెంటు..
రాఘవయ్య: సరే దాని కథ ఇంకో పాలి చెప్పుకుందాం కానీ ముందు ఈ ఎరువుల కథ ఇందాం. నువ్వు సెప్పు బుజ్జమ్మా.
భూమి: అ.. ఆవు మూత్రం అంటే గుర్తోచ్చినాది..పంచ గవ్య..అనీ..
ఎల్లమ్మ: ఏందీ..పంచామృతాలా...
రాఘవయ్య: ఛీ..ఛీ..పంచ గవ్యాలంటే పంచామృతాలంటావ్ ...
భూమి: ఒక రకంగా..అలాటిదేలే..పంచామృతంలో ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి లాంటి తీపి వస్తువులు కలుపుతారు.. ఈ పంచగవ్యలో ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు పేడ, ఆవు మూత్రం ఉంటాయి. వీటికి తోడు చెరకు రసం, కొబ్బరి నీళ్ళు, బాగా పండిన అరటి పండ్లు కూడా కలుపుతుంటారు. ఒక్కో సారి కల్లు, బెల్లం కలుపుతారు. ఈ మిశ్రమాన్ని కొన్ని రోజులు ఉంచి నేరుగా భూమికి కానీ, పలుచన చేసి పంటల మీద కానీ చల్లితే భూమి, మొక్కలు కూడా తిరిగి బలం పుంజు కుంటాయి.
రాఘవయ్య: మరి నువ్వు సెప్పినట్టు ఈ ఆవు పేడ, ఆవు మూత్రం యేస్తే ఎట్టాంటి భూమైనా సరే బంగారం పండిస్తదంటావా?
భూమి: అంటే మామా ఇది టానిక్కు లాంటిదనుకో. కానీ కొన్ని భూములకు కొన్నికొన్ని సమస్యలుంటాయి. అట్టాంటప్పుడు మనం ముందుగా వాటిని బాగుచేసుకోవాల.
ఎల్లమ్మ: భూములకు కూడా సమస్యలా...మనకే సమస్యలున్నాయనుకున్నాను..
భూమి: ఒక రకంగా భూముల సమస్య కూడా మన సమస్యే ..మన భూములను బాగు చేసుకుంటే మనమే బాగు పడతాం.
రాఘవయ్య: బుజ్జమ్మా ఇప్పుడు భూమిని చదునుగా కాక బోదెలు, కాలవలు లాగ సేయమంటున్నారు ఎందుకంటావ్?
భూమి: అది..మామా..నేల లోతు తక్కువగా ఉన్నప్పుడు అలా బోదెలుగా చేసి వాటి మీద పైరును నాటితే మంచిదంట. అయితే ఈ బోదెలు, కాలువలు భూమి వాలుకి అడ్డంగా చేయాలంట. . అదే నేలలో ఇసుక శాతం ఎక్కువ ఉందనుకో, వేసవిలో వర్షాలకు ముందే చెరువు మట్టిని తెచ్చి చేను మొత్తం పలచగా చల్లి భూమిలో కలియదున్నాలి. ఆ తర్వాత 200 కిలోల బరువు గల రోలర్ ను 5 -6 సార్లు నడిపించాలి. ఇలా చెరువు మట్టి వేయడం వలన భూమిలో బంక మన్ను శాతం పెరుగుతుంది.
ఎల్లమ్మ: అంటే మన్నుకు మన్నే మందన్న మాట. ఇసుక నేల దున్ని బాగుపడడు బంక నేల దున్ని చెడడు అని వదిలేయకుండా ఇట్టా చేస్తే మంచిదే
భూమి: సరిగ్గా చెప్పావు అత్తా..అందుకే అంటారు ఒకరకం నేల మరొక రకం నేలకు ఎరువని
రాఘవయ్య: బుజ్జమ్మా ... అంత బరువు రోలర్ను భూమి మీద దోర్లిస్తే నేల గట్టిపడి పోతుంది కదా..మరి భూమి గట్టిపడి పోవడం కూడా ఒక సమస్యే గాదేటి?
భూమి: ఇలా ఇసుక ఎక్కువగా ఉన్న నేలలకు అదే వైద్యం కానీ.. కొన్ని నేలల్లో అది నువ్వన్నట్టు పెద్ద సమస్యే .
ఎల్లమ్మ: మన నేలలో ఆ సమస్య ఉన్నదీ లేనిదీ మనకేట్టా తెలుసుద్ది?
భూమి: ఈ సమస్యను మనం తేలికగానే గుర్తించవచ్చు.
ఒక మీటరు వెడల్పు, పొడవు, లోతు గల గోయ్యిని తవ్వి చూస్తె భూమిలోపల గట్టి పొర కనబడుతుంది. గట్టి పొరకు పైన, కింద మామూలు మట్టి ఉంటుంది. చిన్న పాటి చాకును గుచ్చి ఈ గట్టి పొర ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చును. పెద్ద ట్రాక్టరుతో లోతుగా దున్నే నాగళ్ళతో దున్ని ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ లోతు చాళ్ళను 60 సెంటీ మీటర్ల దూరంలో రెండు వైపులా తోలాలి. దీనితో బాటు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 2 టన్నుల జిప్సం వేస్తే కూడా మంచిది. ఈ లోతు దుక్కి ప్రభావం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇటువంటి నేలల్లో ఎకరాకు 2 టన్నుల వరి పొట్టు గానీ లేక దంచిన వేరుశనగ పొట్టును గానీ పొలంపై చల్లి , పై పొరలో బాగా కలిసేలా దున్నాలి.
రాఘవయ్య: నువ్విట్టంటున్నావ్ కానీ బుజ్జమ్మా ఇప్పుడు కొంతమంది అసలు నేలను దున్ననే వద్దంటున్నారు.
భూమి: జీరో టిల్లేజ్ అనీ ..ఆ పద్ధతి కూడా ఉందనుకో ... అది ..ఆ యా పరిస్థితి బట్టి ఉంటుంది.
ఎల్లమ్మ: అంతేలే …పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం ఉండదుగా…మరి చౌడు భూములనెట్టా బాగు సేయ్యాల..
రాఘవయ్య: ఈ సౌడు భూముల సంగతి నాకెరికేలే ..అందిట్లో పాల చౌడనీ, కారు చౌడనీ ఉంటాయి..పాల చౌడంటే ఏసం కాలంలో నేలపైన తెల్లగా అగుపిస్తుంది. ఈ పేరుకొన్న చౌడును పారతో చెక్కి తీసి వేయాలి. పొలాన్ని చిన్న మడులుగా చేయాలి. ప్రతి మడిలో షుమారు 20 సెం. మీ. లోతు నీరు నిల్వ ఉండేటట్లు సాగు నీటిని పెట్టాలి. ఈ నీటిని మడిలో 4 లేక 5 రోజులు నిలువ ఉంచి ఇంకనీయాలి. తర్వాత మురుగు నీరు కాలువలద్వారా తీసివేయాలి. ఈ విధంగా ౩-4 సార్లు చేస్తే చౌడు తీవ్రత చాలా వరకు తగ్గుతుంది.
భూమి: మరి మామా, కారు చౌడును ఎట్టా బాగు చెయ్యాలి?
రాఘవయ్య: అదీ ఇట్టాగే ...కాకుంటే ఈ నేలల్లో నీరు ఇంకే గుణం తక్కువగా ఉంటాది. అందుకే మళ్ళ నుండి మురుగు నీరు పోయేలాగా మురుగు నీటి కాలవలు చేసుకోవాలి.
ఎల్లమ్మ: కారు చౌడంటే, భూమి మీద పొర నల్లగా ఉంటాదా?
రాఘవయ్య: అ.. బాగానే సెప్పావ్.. అయితే ఈ భూమిలో మనం జిప్సం ఎసుకోవాల. ఒకవేళ నేలలో సున్నం కనుక ఎక్కువుంటే పొడి చేసిన గంధకాన్ని వాడుకోవాల. తెల్లచౌడు ఒక మోస్తరుగా ఉంటే జీలుగను పెంచి మట్టిలో కలియ దున్నాలి. అట్టాగే ఆ నేల స్వభావాన్ని తెలుసుకుని దానికి ఏమెయ్యాలో తెలుసుకుని బాగు చేసుకోవాల.
భూమి: మామా.. భూమిని బాగు చెయ్యాలంటే అన్నీ ఏసేడమే కాదు.. కొన్నిటి ని తీసేయాలి కూడా..
రాఘవయ్య: ఓహో ..అట్టాగా...
భూమి: ఇప్పుడంతా కాలుష్యమయం కదా.. ఆ కాలుష్యం భూమికి కూడా పట్టుకున్నాది.. మరి దాన్ని వదిలించద్దూ
రాఘవయ్య: అ..వదిలించద్దూ మరీ.
భూమి: అందుకే కొన్ని రకాల చెట్లను, మొక్కలను పెంచి నెలలోని విషపూరిత కాలుష్య కారకాలను భూమిలోపలి నుండి బయటకు తెచ్చేయాలి. ఇలా చేయడాన్ని చేయడాన్ని ఫైటోరేమిదిఎషన్ అంటారు. ఇది ఇప్పుడిప్పుడే అభివృద్ది చెందుతున్న శాస్త్ర విజ్ఞానం. రాబోయే కాలంలో ఇది ఒక పరిశ్రమగా అవ్వచ్చంట. మా ఆయన వాల్లాఫీసులో దీని గురించే పరిశోధనలు చేస్తున్నారంట. అందుకే నాకూ తెలిసినదనుకో. ఈ మొక్కలు నేలలోని లోహాలను రవాణా చేసి తేలికగా కోయడానికి వీలుండే వేళ్ళు, కాండాలలో జమ చేస్తాయి. కొన్ని రకాల మొక్కలు కొన్ని ఆవిరి కాగల రసాయనాలను తొలగిస్తాయంట. ఆవమొక్కలుంటాయే అవి...అదేందీ .. అ..సిలీనియం ను ఇట్లా తొలగిస్తాయంట. మరొక పద్ధతిలో విషలోహాలు తొలగింపబడవు కానీ వాటి విషప్రభావం తక్కువ చేయ బడుతుంది.
రాఘవయ్య: అయితే మన భూమిని బాగు చెయ్యడానికి ఇన్ని రకాల కొత్తకొత్త పద్ధతులొస్తున్నాయన్నమాట.
ఎల్లమ్మ: ఆ భూమి గురించి అంతగా పట్టించుకునేఓడు మన భూమి తల్లిని పట్టించుకోట్లే దేంటి.

భూమి: సరే మామా ..అమ్మ కాసుకో నుంటాది .. ఎల్లొస్తా...అత్తా .. రేపు మన స్కూలు కాడ.. ఆఫీసోళ్ళు ఎవరో జీవన ఎరువుల గురించి చెప్తారంట. మర్చిపోకుండా తొందరగొచ్చేయ్.
• * * * * *
ఎల్లమ్మ: లచ్చమ్మా.. లచ్చమ్మా..
లచ్చమ్మ: రా ...రా ...ఎల్లమ్మా ..బాగున్నావా..
ఎల్లమ్మ: అ..బాగానే ఉన్నా గానీ..భోజనాలైనాయా..
సావిత్రమ్మ: అయినాయ్ గానీ..ఏదో పని మీదొచ్చినట్లున్నావ్...నువ్వూరికే రావు కదా..మా ఇంటికి.
ఎల్లమ్మ: అ..సావిత్రమ్మా బాగుండావా... ఏవో జీవన ఎరువులంట.. దాని గురించి చెప్తారు.. రమ్మంది ..మన భూమి.. కానీ నాకే తీరలేదు ..
సావిత్రమ్మ: మన భూమి ఎల్లిందిలే...ఇదుగో..నేనూ పోయొచ్చా ...రాకపోతే నా మనుమరాలు ఊరుకుంటుందా..
ఎల్లమ్మ: నువ్వు పోలేదా లచ్చమ్మా
లచ్చమ్మ: నాకెక్కడ కుదుర్తాది? అయినా ఈల్లిద్దరూ పోయినారంటే ..మనకు చూసింది చూసినట్లు చెప్తారు.
సావిత్రమ్మ: అదేం లేదులే ఎల్లమ్మా ..ఆ..వానపాము ఎరువు మనకు తెలిసున్నాదే కదా ..ముందు దాని గురించి చెప్పినారు.. ఆ తర్వాత ఇంక ఏవో స్సూచ్మ జీవులంట ..వాటి గురించి చెప్పినారు. అప్పుడర్ధమైనట్లే ఉంది గానీ.. ఆ పేర్లు చెప్పనీకి నాకు రాదే .. మన భూమిని రానీ..
అంజయ్య: ఎల్లమ్మత్తా..బాగుండావా..నేనూ ఎల్లానులే మీటింగుకి.. పాపం పని పాటా మనుకోనోచ్చినావు ...నేను సెప్తా గానీ ..
ఎల్లమ్మ: నువ్వు చెప్తే మంచిదే గదా అంజయ్యా
అంజయ్య: అదేందంటే అత్తమ్మా ..జీవన ఎరువులంటే సూక్ష్మ జీవుల కణాలు. ఇవి కోట్లాది సంఖ్యలో ఉంటాయి. నేలకు వేసినప్పుడు వీటి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. ఇందులో చాలా రకాలుంటాయనుకో. బాక్టీరియా అనీ, శిలీంద్రాలు అనీ. మల్లేమో నాచు ఉంటాదే అది కూడా జీవన ఎరువే. ఇవి విడి విడిగా కానీ కలిసి గానీ భూమికి ఎరువుగా వేసుకోవచ్చు.
ఈ బాక్టీరియాల్లో కొన్ని నత్రజనిని స్థిరీకరిస్తాయి..కొన్నేమో భాస్వరాన్ని కరిగిస్తాయి. ఈ నత్ర జనిని స్థిరీకరించేవి మొక్కతో కలిసి జీవిస్తాయి. నాచు కూడా నత్రజనిని స్థిరీకరిస్తుంది. కాకపొతే ఇవి స్వతంత్రంగా జీవిస్తాయి.
సావిత్రమ్మ: అబ్బయ్యా..అదేందదీ..నీలి పచ్చ ఆకా..వరి పొలాల్లో ఎసుకోవచ్చు అన్నారు అదేంది?
అంజయ్య: నీలి ఆకు పచ్చ నాచు.. అది కూడా నాచే. ఈ నాచు ఎరువు 10 కిలోల సంచీలో లభిస్తుందంట. దీన్ని రైతులు కూడా పెంచుకోచ్చంట. సిమెంట్ తొట్టెలలో రంపం పొట్టు, బూడిద, సూపర్ ఫాస్ఫేట్ యేసి పెంచుకోవచ్చు.
ముఖ్యంగా ఏటంటే ..వీటి వలన వాతావరణ కాలుష్యం ఉండదు. నేలకు.. పంటకు ఎలాటి హాని ఉండదు.
ఎల్లమ్మ: అయితే వీటిని మిగతా ఎరువులతో బాటే యేసేయచ్చా?
అంజయ్య: లేదు.. వీటిని పురుగు మందులతో గానీ..రసాయన ఎరువులతో గానీ కలప కూడదు...
సావిత్రమ్మ: నీకు అన్ని ఇషయాలూ బాగానే గుర్తున్నాయిరా..అబ్బాయ్..
అంజయ్య: ఇవి గుర్తున్నాయే ..ఆటి పేర్లే గుర్తులేవు.. మన భూమి తల్లిని రానీ
లచ్చమ్మ: మాటల్లోనే వచ్చేసినాది మన భూమితల్లి ..నూరేల్లాయుస్సు..
అంజయ్య: అమ్మా భూమీ..ఆ జీవన ఎరువుల గురించి తెలుసుకోడానికి మన ఎల్లమ్మత్త వచ్చినాది.. యివరాలన్నీ చెప్పినా గానీ ..ఆ పేర్లే నాకు గుర్తు లేవు ...నీ కు గుర్తుండాయా
భూమి: నాకూ గుర్తులేదు నాయనా..వాళ్ళు ఆ ఇవరాలన్నీ రాసిన కాయితాలిస్తారంట. నేను పేర్లు మాత్రం రాసు కోచ్చినాను. చదవాల్నా..
అంజయ్య: చదువు..
సావిత్రమ్మ: ఇనుకుంటే..అనుకుంటే ..అవ్వే ఆలవాటౌతాయ్
భూమి: రైజోబియం ..
అంజయ్య: ఆ..రైజోబియం..ఇది చాలా సార్లు ఇన్నాలే
భూమి: అజటోబాక్టర్
సావిత్రమ్మ: అ.. అజటోబాక్టర్ .. అట్టంటిదే ఇంకోటి ఉన్నాది..ఏం దదీ
భూమి: అజోస్పిరిల్లం ..
సావిత్రమ్మ: ఆ..అజోస్పైరిల్లం
భూమి: అజోల్లా ..
సావిత్రమ్మ: అ..అజోల్లా..ఈ పేరు బాగుందే..సిన్న పేరు..
భూమి: నాయనమ్మా ..సంబర పడకు.. ఇప్పుడొచ్చేది పెద్ద పేరు..ఫాస్ఫోబాక్టీరియా ..
అంజయ్య: బాక్టీరియా..దాని ముందు ఫాస్ఫో చేరిస్తే అయిపోయే
భూమి: మైకోరైజ..
ఎల్లమ్మ: మైకోరైజ... ఆ...చాలానే ఉండాయి. అయితే అంజయ్యా ..మనం వీటి గురించి ఇంకా తెలుసుకుని ..మనం అందరమూ వీటిని వాడుకుంటే ... మనం, మన భూమి బాగుంటాం..అన్న నమ్మకం వచ్చేసినాదనుకో ...మరి నే వస్తా..
అమ్మా భూమీ ...ఇదిగో ..నీ కోసం ఈ పొడి చేసినా ...నూనె చెక్కలన్నే కలిపి చేసినా..నీ ఆరోగ్యానికి చాలా మంచిది..మామ నీకోసం చేను కాడ్నుంచి గోంగూర, తోటకూర, మునగాకు తెచ్చినాడు..అమ్మతోని కమ్మగా వండించుకుని తిను. త్వరలో మమ్మల్ని నీ సీమంతానికి పిలవాల…

రాఘవయ్య: అంజయ్యా ..అంజయ్యా ..ఇదుగో భూమి తల్లి కాడ్నుంచి ఉత్తరమొచ్చినాది ...నేను ఇటే వస్తుంటే మన పోస్టు ప్రసాదు ఇచ్చిండు.
అప్పుడు మన భూమి తల్లి చెప్పిన పద్ధతులన్నీ పాటిస్తే ..మన భూమి కొత్త పెళ్లి కూతురిలా కళ కళ లాడతా ఉంది.. జల కళ కూడా బాగా ఉంది. నీళ్ళు బాగా నిలిచి ఉన్నాయ్
అంజయ్య: రాఘవయ్యా మన భూమి తల్లి నీల్లోసుకున్నాది..
సావిత్రమ్మ: శుభం ...ఇప్పుడు మా ఇంట్లో పండంటి బిడ్డ పుట్టడం ఖాయం ...
రాఘవయ్య: ఇప్పుడు మా పొలంలో పుట్టెడు పంట పండడం కూడా ఖాయం ...

Edutainment

Edutainment
Crossword puzzles for farmers